Thursday, November 6, 2014

Kartika Puranamu in Telugu - Chapter 15 - కార్తీక పురాణము

కార్తిక పౌర్ణమి రోజు

15 వ అధ్యాయము

దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వ జన్మ స్మృతితో  నరరూపమందుట



కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మన సారా శ్రీహరి ని పూజించిన వారికీ అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ ని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీ ప నైవేద్యము యిచ్చిన యెడల, విశే ష ఫలము పొందగలరు.  కార్తీక శుద్ధ  త్ర యోదశి, చెతుర్ద శి , పూర్ణ మరోజులందు నిష్ట తో పూజలు చేసి  ఆవునే తితో దిపమునుంచవలెను.


ఈ మహా కార్తీక కములో ఆవుపాలు పితికి నంత సేపు మాత్ర ము దీ పముంచిన యెడల  మరు జన్మలో మంచి జన్మమును పొందును. ఇతరులు వుంచిన ధీ పము మెగ ద్రోసి వృద్ద చేసిన యె డల, లేక , ఆరి పోయిను  దీపమును  వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. వినుమని వశిస్టులవారు యిట్లు చెప్పుచునారు.

సరస్వతి నదీ తీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్టుడైన  దయార్ద్ర  హృదయుడగు ఒక యోగి పుంగ వుడు అ దేవాలయము వద్ద కు వచ్చి కార్తీక మాసము ప్రారంభ మునుండి, కార్తీక మాసయంతయు   అచటనే గడిపి పురాణ  ప టనము జే యు తలంపురాగా ఆ పాడుబడి యున్న దేవాలయమును శ్రుభ ముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో  వత్తులు జేసి, పండ్రెండు దీ పములుంచి, స్వామిని పుజించుచు, నిష్టతో పురాణము చదువుచుండెను.

ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవెశించి, నలుమూలలు వెదకి, తిన డానికి ఏమీ దొరకనందున అక్కడ అరి పోయియున్న వత్తిని  నోట కరుచుకొని ప్రక్కనున్న దీపమువద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరి పోయిన వత్తి కూడా వెలిగి వెలుతురూ వచ్చెను. అది కార్తీక మాసమగుటవలనను, శివాలయములో ఆరి పోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగి నందున వెంటనే దానిరూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్టలో వున్న యోగి పుంగ వుడు తన కన్నులను తెర చి  ప్రక్క నొక మానవుడు నిలబడి యుండుటను గమనించి "ఓయీ!నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించ గా" ఆర్యా ! నేను మూషిక మును, రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రేవేశించి యిక్కడ కూడా ఏమి దొరక నందున నెయ్యి వాసనలతో  నుండి అరి పోయిన వత్తి ని తిన వలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీ పంచెంత నిలబడి వుండగ, నా అదృష్ట  ముకోలదీ ఆ వత్తి వేలుగుటచే నాపాపములు పోయి నుందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కాని , ఓ మహానుభావా! నేను యెందుకి  మూషిక జన్మ మెత్త వలసివచ్చేనో - దానికి గల కారణమేమిటో విశ దీ కరింపు " మని కో రెను.

అంత యోగీ శ్వరుడు ఆశ్చర్య పడి తన ది వ్యదృష్టి చే సర్వము తెలుసుకొని " ఓయీ! క్రింద టి జన్మలో నీవు  బ్రాహణుడువు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవ సాయంచే స్తూ, ధ నాశాపరుడ వై దేవ పూజలు, నిత్యకర్మములు మరచి, నీ చుల సహవాసము వలన నిషిద్దా న్నము తినుచు, మంచివార లము, యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్ద చింత గలవాడ వై ఆడ పిల్ల లను అమ్ము వృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన  ధనాన్ని కూడ బెట్టుచు, సమస్త తిను బండార ములను కడు చౌక గా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభ వించక యిత రులకు యివ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారి వై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపమును భ వించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరి పోయిన దీ పాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించింది. కాన, నీవు  ని గ్రామమునకు పోయి నీ పెరటి యుందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దాన ధర్మాలు  చేసి భగవంతుని ప్రార్ధించుకొని  మోక్షమును పొందు " మని అతనికి నీ తులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి పంచ దశాద్యయము - పదిహేనవ రోజు పారాయణము సమాప్తము.


స్కంద పురాణము సంస్కృతము - కార్తీక మహాత్యము

http://is1.mum.edu/vedicreserve/puranas/skanda_purana/skanda_purana_02vaishnava_04kartikamasa.pdf

http://www.kamakoti.org/kamakoti/details/skandapurana26.html



Kartika Poornima - Telugu



ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తిక పూర్ణిమ. దీనికి శాస్త్రములయందు విశేషమైన మహా వ్రత దినంగా పేర్కొన్నారు. ముఖ్యమైన పర్వాలలో ఇది ఒకటి.

పూర్ణిమ, అమావాస్య పూర్ణ తిథులు కనుక ఈరోజున యే పూర్ణిమ అయినా యే అమావాస్య అయినా కూడా ఈరోజున చేసిన ధ్యానాదులకు అద్భుతమైన విశేష ఫలం వస్తుంది అని సర్వ శాస్త్రములూ చెప్తున్నాయి. పైగా మనకు వేదకాలం నుంచి దర్శ పూర్ణ మాసేష్టులు మొదలైనవి అన్నీ కూడా పూర్ణిమ నాడు చేసే యజ్ఞ యాగాదులకు ఉన్న ఫలితం గురించి చాలా వివరించాయి. పూర్ణిమ నాటి సాధనలు మన మనస్థితిని కూడా ఒక పరిణతిలోకి తీసుకు వెళ్తాయి.


కార్తిక మాసమే వ్రతాల మాసం. ఆ కాలాన్ని కొద్దిపాటి సాధనతో సద్వినియోగం చేసుకుంటే ఇహమూ బాగుంటుంది, పరమూ బాగుంటుంది, పరమార్థమూ లభిస్తుంది. ఈ కార్తికంలో ఏ వ్రతం కొద్దిపాటి చేసినప్పటికీ కూడా విశేష ఫలాన్నిస్తున్నది.


కార్తిక వ్రతములు చాలా ఉన్నాయి. ముఖ్యముగా ఉపవాస వ్రతములు, నక్త వ్రతములు చెప్పబడుతున్నాయి. పగలంతా ఉపవసించి సంధ్యా సమయంలో భగవదారాధన చేసి అటు తర్వాత రాత్రియొక్క ప్రారంభ దశలో ఆహారాన్ని తీసుకుంటే నక్త వ్రతం అని అంటారు. అది పాటించలేనప్పుడు కార్తికంలో స్నానం చేయడం, దీపం పెట్టడం, ఆలయ దర్శనం, ఏదో ఒక పారాయణం, ఏదో ఒక నియమం పెట్టుకోవాలి కార్తిక మాసంలో. అదేవిధంగా ముఖ్య తిథులు కొన్ని ఉన్నాయి పంచ పర్వములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. కార్తికంలో ఈ అయిదింటినీ పంచ మహా పర్వములు అని కూడా అంటారు. దీనికి పంచక వ్రతము అని కూడా పేరు. ఈ అయిదు రోజులూ నియమబద్ధంగా భగవదారాధన చేయడం, అభిషేకాదులు చేయడం చాలా విశేష ఫలితాలను ఇస్తాయి. అందులో చివరి రోజు పూర్ణిమ. ఈ అయిదూ చేయలేనప్పుడు పూర్ణిమ వ్రతమైనా చేయాలి. నెలరోజులూ వీలు కానప్పుడు అయిదు రోజులు, అయిదు రోజులూ వీలు కానప్పుడు పూర్ణిమ. అంత ప్రాధాన్యమున్నది. పైగా ఈ సమయంలో దీప దానం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. వీలైనన్ని దీపాలు వెలిగించి భగవదారాధన చేయాలి.

మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసం దానానికి, కార్తిక మాసం దీపానికీ ప్రాధాన్యమిచ్చినది. ఒక్క దీపం భగవంతుని ఉద్దేశించి వెలిగించినట్లయితే అది మనకున్న అజ్ఞాన దారిద్ర్యాలను బాధలను తొలగిస్తుందని శాస్త్ర వచనం. పూర్ణిమ నాడు ఏ చిన్నపాటి సాధన చేసినప్పటికీ మహా యజ్ఞ ఫలితం వస్తుంది. అందుకే సంవత్సరంలో ఈ రోజును మాత్రం వృధా చేసుకోరాదు. ఈరోజున ఉపవాసము/ఆహార నియమము పాటిస్తూ స్నానము, దీపము, దానము, ధ్యానము ఇత్యాదులు చేయాలి.

ఈరోజున చేసేది ఏదైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. దీపం వెలిగించడంతో పాటు ఒక పీటపై స్వస్తిక్ చిహ్నాన్ని, పద్మాన్ని, శంఖము, చక్రము, శ్రీకారము కూడా లిఖించి వాటిని పూజ చేస్తే ఒక విశేషం అన్నారు. స్వస్తిక్ చిహ్నమే శుభాన్ని, లాభాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు.


కార్తిక మాసంలో విష్ణువును దామోదర అనే పేరుతొ ఆరాధిస్తారు.  దామోదర అన్న మాటకి సర్వ భూతములూ తనలో కలిగినవాడు అని అర్థం. అలాంటి దామోదర మాసమిది. అందుకు కార్తిక దామోదర ప్రీత్యర్థం అని ఏ కర్మనైనా చేస్తారు.

అలాంటి ఆ దామోదరుడు కృష్ణావతారంతో ధన్యులైన గోపికలతో కలిసి రాసలీల చేసినటువంటిది.
రాసలీల అంటేనే ఒక పూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం. జీవాత్మలు పరమాత్మతో లీనమైనటువంటి అవస్థని ఇక్కడ రాసలీల అంటారు. ఆ రాసలీలావస్థ ఒక పూర్ణావస్థ.  ఆ పూర్ణావస్థలో కలిగే దివ్యానందమే రాసలీలానుభవం. అందుకు ఈ రాసలీల జరిగినటువంటి రోజు కూడా ఇది.

మహాకార్తికి

మహాకార్తికి అంటే కృత్తిక నక్షత్రముతొ కలసిన కార్తిక పూర్ణమి

అంతేకాదు ఈ రోజు ఏ దేవతను ఆరాధించినా విశేషమే. ఎందుకంటే దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నక్షత్రం కృత్తిక; ఏ దేవతను ఆరాధించాలన్నా "అగ్నిముఖావై దేవాః" అన్నారు గనుక ఈ అగ్ని నక్షత్రమైన కృత్తిక నాడు ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత సంపూర్ణమైన తృప్తిని పొందుతుంది.


అంతేకాదు ఆదివారం సూర్యుని, శివుని; సోమవారం గౌరీదేవిని; మంగళవారం సుబ్రహ్మణ్యుని, గణపతిని; బుద్ధవారం విష్ణువును, గురువారం బ్రహ్మ దేవుని, దక్షిణామూర్తి, హయగ్రీవ వంటి గురుస్వరూపాలను; శుక్ర వారం ఇంద్రుని, ఇంద్రుడు ఆరాధించిన మహాలక్ష్మిని; అలాగే శనివారం శనైశ్చరుని, యముని, రుద్రుని ఆరాధించాలి అని మనకు శాస్త్రములు చెప్తున్నాయి. ఇవి ఏ మాసంలో చేసినా విశేషమే. కానీ అన్ని మాసాలలో ఏడు రోజుల వ్రతం మనం చేయలేం. కానీ కార్తికంలో మాత్రం ఈ వార యజనం చేస్తే సంవత్సరం అంతా వారయజనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అందుకే కార్తికంలో ఏది చేసినా సంవత్సరమంతా ఆ యజ్ఞము చేసిన ఫలితం వస్తుంది.

అందులో ప్రత్యేకించి ఈ పూర్ణిమ నాడు పైన చెప్పిన నియమాలతో పరమేశ్వరుని, విష్ణువుని ఆరాధించాలి. శాస్త్రబద్ధమైన నియమ పాలనతో మహాకార్తికి సాధన చేసి కార్తిక దీప జ్యోతిలో ఆ పరమేశ్వర ప్రకాశాన్ని దర్శించి ధన్యులమౌదాం.