Wednesday, December 24, 2014

Atal Behari Vajpayee Biography - Telugu - అటల్ బిహారీ వాజపేయి








అటల్ బీహార్ వాజ్పేయి 1924 డిసెంబర్ 25 న జన్మించారు.
వాజ్పేయి గౌలియార్ యొక్క విక్టోరియా కాలేజ్ (ప్రస్తుతం లక్ష్మీ బాయి కాలేజ్) కు హాజరైనారు
1996 సాధారణ ఎన్నికల్లో బిజెపి లోక్సభ ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అప్పటి అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు వాజ్పేయి ఆహ్వానించారు. వాజ్పేయి భారతదేశం యొక్క 10 వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం, కానీ బిజెపి మెజారిటీ పొందటానికి ఇతర పార్టీల నుండి తగినంత మద్దతు కూడగట్టడానికి విఫలమైంది. అ 13 రోజుల తర్వాత రాజీనామా చేశారు.
 1998 సాధారణ ఎన్నికల్లో మళ్ళీ ముందుకు బిజెపి. ఈ సమయంలో, రాజకీయ పార్టీల బంధన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే), వాజ్పేయి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్డిఎ పార్లమెంట్ లో మెజారిటీ నిరూపించాడు. ప్రభుత్వం మధ్య 1999 వరకు 13 నెలల పాటు కొనసాగింది.  అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) J. జయలలిత ప్రభుత్వం దాని మద్దతు ఉపసంహరించుకున్నారు.  ప్రతిపక్ష కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయలేకపోయింది.  లోక్ సభ మళ్ళీ రద్దయ్యింది.  తాజా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగా వరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు.
1999 సాధారణ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ,  లోక్ సభ లో 543 సీట్లలో 303 సీట్లు గెలుచుకుంది. అక్టోబర్ 1999 న 13, అటల్ బీహార్ వాజ్పేయి మూడవ సారి భారతదేశం యొక్క ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు.


____________

____________
ABN Telugu


http://telugu.oneindia.com/news/india/bharat-ratna-for-vajpayee-malviya-modi-makes-bjp-happy-148473.html


Saturday, December 20, 2014

12 ప్రాముఖ్యత గల టెక్నాలజీలు, విషయములు - Top 12 Strategic Technologies and Issues - 2014 - Telugu

 అంతర్జాతీయ వ్యాపార వాతావరణంలో కొన్ని  టెక్నాలజీలను, విషయములను   ప్రాముఖ్యత గల టెక్నాలజీలు, విషయములు  అని గ్లోబల్ టెక్టోనిక్స్  సంస్థ అధ్యయనం నిర్వహించి  ఆమోదించింది. .

12 టెక్నాలజీలు, విషయములు

బయోటెక్నాలజీ
నానోటెక్నాలజీ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
జనాభా
పట్టణీకరణ
వ్యాధి మరియు ప్రపంచీకరణ
రిసోర్స్ మేనేజ్మెంట్
పర్యావరణ హైన్యం
ఆర్థిక సమన్వయము
నాలెడ్జ్ ప్రచారం - విజ్ఞాన ప్రచారం
కాన్ఫ్లిక్ట్ - ఘర్షణ
గవర్నెన్స్ - పాలన

http://www.iienet2.org/Details.aspx?id=36514

Thursday, December 18, 2014

Digital India Plan - Telugu - డిజిటల్ భారతదేశం ప్రణాళిక



న్యూ ఢిల్లీ, Dec 17, 2014: రీసెర్చ్ సంస్థ మెక్కిన్సే డిజిటల్ భారతదేశం ప్రణాళిక , కీలక  సాంకేతిక పద్ధతులు ఉపయోగించండము  2025 సంవత్సరానికి 550 బిలియన్ల నుండి $ 1 ట్రిలియన్ డాలర్ల వరకు  భారతదేశం యొక్క జాతీయ ఆదాయం  పెంచడానికి సహాయం చెయ్యచ్చు అని చెప్పిన్ది.

న్యూయార్క్ ఆధారిత సంస్థ మెక్కిన్సే డిజిటల్ టెక్నాలజీలు మరియు స్మార్ట్ భౌతిక వ్యవస్థల్లో  మంచి అవకాశం ఉంది అని తెలియ చేసిన్ది. 
"ఆర్థిక సేవలు, ఆరోగ్య, వ్యవసాయం, ఇంధనం, మౌలిక సదుపాయాలు, విద్య రంగాల్లో నూతన  టెక్నాలజీస్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి సదుపాయాములు కలగా చేసే అవకాశం ఉంది అని స్పష్టము చేసింది

మెకిన్సే మొబైల్ ఇంటర్నెట్, క్లౌడ్ టెక్నాలజీ, డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ గుర్తింపు, థింగ్స్ ఇంటర్నెట్, తెలివైన రవాణా, ఆధునిక భౌగోళిక సమాచార వ్యవస్థ మరియు తదుపరి తరం జెనోమిక్స్ స్వీకరణ లను ప్రముఖ టెక్నాలజీస్గా ఎంపిక చేసిన్ది.

భారతదేశం యొక్క మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు (స్మార్ట్ ఫోన్  యజమానులు)  700 నుండి  900 మిలియన్మధ్య  ఉండవచ్చని అంచనా వేసింది

Sunday, December 14, 2014

Telugu Pelli Paatalu - Padyaalu - తెలుగు పెళ్ళి పాటలు పద్యాలు



Seethamma Pellante  Kalyana Vaibhogame Album on Raaga Music

సీతమ్మ పెళ్ళంటే

http://www.raaga.com/play/?id=150232

Play the Song
http://www.raaga.com/player5/?id=150232&mode=100&rand=0.8903758658561856




Annamayya Paata
సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా

http://annamacharya-lyrics.blogspot.in/2007/04/188siggari-pemdli-kutura.html



సీతమ్మ  పెళ్ళి కూతురాయెనే

తెలుగు పెళ్ళి పాటలు పద్యాలు


జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః

తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన యీ పద్యం తరచూ కనిపించేది. ఇది సీతారాముల పెళ్ళివేడుకలో ముత్యాల తలంబ్రాలను వర్ణించే పద్యం

ఆరుద్ర గారు -  సీత కల్యాణం లో జానక్యా పద్యానికి అనువాదం
ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు సీత తలంబ్రాలకై తీసింది.
తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి.
కెంపులనుకున్నవి, రామయ్య మైచాయ సోక గా నీలమ్ములైనాయి.
ఇన్ని రంగులు చూసి ఇంతి తెల్లబోయింది. ఇనకులుడు చిరునవ్వు నవ్వాడు


http://telugupadyam.blogspot.in/2012/04/blog-post.html

Thursday, November 6, 2014

Kartika Puranamu in Telugu - Chapter 15 - కార్తీక పురాణము

కార్తిక పౌర్ణమి రోజు

15 వ అధ్యాయము

దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వ జన్మ స్మృతితో  నరరూపమందుట



కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మన సారా శ్రీహరి ని పూజించిన వారికీ అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ ని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీ ప నైవేద్యము యిచ్చిన యెడల, విశే ష ఫలము పొందగలరు.  కార్తీక శుద్ధ  త్ర యోదశి, చెతుర్ద శి , పూర్ణ మరోజులందు నిష్ట తో పూజలు చేసి  ఆవునే తితో దిపమునుంచవలెను.


ఈ మహా కార్తీక కములో ఆవుపాలు పితికి నంత సేపు మాత్ర ము దీ పముంచిన యెడల  మరు జన్మలో మంచి జన్మమును పొందును. ఇతరులు వుంచిన ధీ పము మెగ ద్రోసి వృద్ద చేసిన యె డల, లేక , ఆరి పోయిను  దీపమును  వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. వినుమని వశిస్టులవారు యిట్లు చెప్పుచునారు.

సరస్వతి నదీ తీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్టుడైన  దయార్ద్ర  హృదయుడగు ఒక యోగి పుంగ వుడు అ దేవాలయము వద్ద కు వచ్చి కార్తీక మాసము ప్రారంభ మునుండి, కార్తీక మాసయంతయు   అచటనే గడిపి పురాణ  ప టనము జే యు తలంపురాగా ఆ పాడుబడి యున్న దేవాలయమును శ్రుభ ముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో  వత్తులు జేసి, పండ్రెండు దీ పములుంచి, స్వామిని పుజించుచు, నిష్టతో పురాణము చదువుచుండెను.

ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవెశించి, నలుమూలలు వెదకి, తిన డానికి ఏమీ దొరకనందున అక్కడ అరి పోయియున్న వత్తిని  నోట కరుచుకొని ప్రక్కనున్న దీపమువద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరి పోయిన వత్తి కూడా వెలిగి వెలుతురూ వచ్చెను. అది కార్తీక మాసమగుటవలనను, శివాలయములో ఆరి పోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగి నందున వెంటనే దానిరూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్టలో వున్న యోగి పుంగ వుడు తన కన్నులను తెర చి  ప్రక్క నొక మానవుడు నిలబడి యుండుటను గమనించి "ఓయీ!నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించ గా" ఆర్యా ! నేను మూషిక మును, రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రేవేశించి యిక్కడ కూడా ఏమి దొరక నందున నెయ్యి వాసనలతో  నుండి అరి పోయిన వత్తి ని తిన వలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీ పంచెంత నిలబడి వుండగ, నా అదృష్ట  ముకోలదీ ఆ వత్తి వేలుగుటచే నాపాపములు పోయి నుందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కాని , ఓ మహానుభావా! నేను యెందుకి  మూషిక జన్మ మెత్త వలసివచ్చేనో - దానికి గల కారణమేమిటో విశ దీ కరింపు " మని కో రెను.

అంత యోగీ శ్వరుడు ఆశ్చర్య పడి తన ది వ్యదృష్టి చే సర్వము తెలుసుకొని " ఓయీ! క్రింద టి జన్మలో నీవు  బ్రాహణుడువు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవ సాయంచే స్తూ, ధ నాశాపరుడ వై దేవ పూజలు, నిత్యకర్మములు మరచి, నీ చుల సహవాసము వలన నిషిద్దా న్నము తినుచు, మంచివార లము, యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్ద చింత గలవాడ వై ఆడ పిల్ల లను అమ్ము వృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన  ధనాన్ని కూడ బెట్టుచు, సమస్త తిను బండార ములను కడు చౌక గా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభ వించక యిత రులకు యివ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారి వై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపమును భ వించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరి పోయిన దీ పాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించింది. కాన, నీవు  ని గ్రామమునకు పోయి నీ పెరటి యుందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దాన ధర్మాలు  చేసి భగవంతుని ప్రార్ధించుకొని  మోక్షమును పొందు " మని అతనికి నీ తులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి పంచ దశాద్యయము - పదిహేనవ రోజు పారాయణము సమాప్తము.


స్కంద పురాణము సంస్కృతము - కార్తీక మహాత్యము

http://is1.mum.edu/vedicreserve/puranas/skanda_purana/skanda_purana_02vaishnava_04kartikamasa.pdf

http://www.kamakoti.org/kamakoti/details/skandapurana26.html



Kartika Poornima - Telugu



ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తిక పూర్ణిమ. దీనికి శాస్త్రములయందు విశేషమైన మహా వ్రత దినంగా పేర్కొన్నారు. ముఖ్యమైన పర్వాలలో ఇది ఒకటి.

పూర్ణిమ, అమావాస్య పూర్ణ తిథులు కనుక ఈరోజున యే పూర్ణిమ అయినా యే అమావాస్య అయినా కూడా ఈరోజున చేసిన ధ్యానాదులకు అద్భుతమైన విశేష ఫలం వస్తుంది అని సర్వ శాస్త్రములూ చెప్తున్నాయి. పైగా మనకు వేదకాలం నుంచి దర్శ పూర్ణ మాసేష్టులు మొదలైనవి అన్నీ కూడా పూర్ణిమ నాడు చేసే యజ్ఞ యాగాదులకు ఉన్న ఫలితం గురించి చాలా వివరించాయి. పూర్ణిమ నాటి సాధనలు మన మనస్థితిని కూడా ఒక పరిణతిలోకి తీసుకు వెళ్తాయి.


కార్తిక మాసమే వ్రతాల మాసం. ఆ కాలాన్ని కొద్దిపాటి సాధనతో సద్వినియోగం చేసుకుంటే ఇహమూ బాగుంటుంది, పరమూ బాగుంటుంది, పరమార్థమూ లభిస్తుంది. ఈ కార్తికంలో ఏ వ్రతం కొద్దిపాటి చేసినప్పటికీ కూడా విశేష ఫలాన్నిస్తున్నది.


కార్తిక వ్రతములు చాలా ఉన్నాయి. ముఖ్యముగా ఉపవాస వ్రతములు, నక్త వ్రతములు చెప్పబడుతున్నాయి. పగలంతా ఉపవసించి సంధ్యా సమయంలో భగవదారాధన చేసి అటు తర్వాత రాత్రియొక్క ప్రారంభ దశలో ఆహారాన్ని తీసుకుంటే నక్త వ్రతం అని అంటారు. అది పాటించలేనప్పుడు కార్తికంలో స్నానం చేయడం, దీపం పెట్టడం, ఆలయ దర్శనం, ఏదో ఒక పారాయణం, ఏదో ఒక నియమం పెట్టుకోవాలి కార్తిక మాసంలో. అదేవిధంగా ముఖ్య తిథులు కొన్ని ఉన్నాయి పంచ పర్వములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. కార్తికంలో ఈ అయిదింటినీ పంచ మహా పర్వములు అని కూడా అంటారు. దీనికి పంచక వ్రతము అని కూడా పేరు. ఈ అయిదు రోజులూ నియమబద్ధంగా భగవదారాధన చేయడం, అభిషేకాదులు చేయడం చాలా విశేష ఫలితాలను ఇస్తాయి. అందులో చివరి రోజు పూర్ణిమ. ఈ అయిదూ చేయలేనప్పుడు పూర్ణిమ వ్రతమైనా చేయాలి. నెలరోజులూ వీలు కానప్పుడు అయిదు రోజులు, అయిదు రోజులూ వీలు కానప్పుడు పూర్ణిమ. అంత ప్రాధాన్యమున్నది. పైగా ఈ సమయంలో దీప దానం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. వీలైనన్ని దీపాలు వెలిగించి భగవదారాధన చేయాలి.

మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసం దానానికి, కార్తిక మాసం దీపానికీ ప్రాధాన్యమిచ్చినది. ఒక్క దీపం భగవంతుని ఉద్దేశించి వెలిగించినట్లయితే అది మనకున్న అజ్ఞాన దారిద్ర్యాలను బాధలను తొలగిస్తుందని శాస్త్ర వచనం. పూర్ణిమ నాడు ఏ చిన్నపాటి సాధన చేసినప్పటికీ మహా యజ్ఞ ఫలితం వస్తుంది. అందుకే సంవత్సరంలో ఈ రోజును మాత్రం వృధా చేసుకోరాదు. ఈరోజున ఉపవాసము/ఆహార నియమము పాటిస్తూ స్నానము, దీపము, దానము, ధ్యానము ఇత్యాదులు చేయాలి.

ఈరోజున చేసేది ఏదైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. దీపం వెలిగించడంతో పాటు ఒక పీటపై స్వస్తిక్ చిహ్నాన్ని, పద్మాన్ని, శంఖము, చక్రము, శ్రీకారము కూడా లిఖించి వాటిని పూజ చేస్తే ఒక విశేషం అన్నారు. స్వస్తిక్ చిహ్నమే శుభాన్ని, లాభాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు.


కార్తిక మాసంలో విష్ణువును దామోదర అనే పేరుతొ ఆరాధిస్తారు.  దామోదర అన్న మాటకి సర్వ భూతములూ తనలో కలిగినవాడు అని అర్థం. అలాంటి దామోదర మాసమిది. అందుకు కార్తిక దామోదర ప్రీత్యర్థం అని ఏ కర్మనైనా చేస్తారు.

అలాంటి ఆ దామోదరుడు కృష్ణావతారంతో ధన్యులైన గోపికలతో కలిసి రాసలీల చేసినటువంటిది.
రాసలీల అంటేనే ఒక పూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం. జీవాత్మలు పరమాత్మతో లీనమైనటువంటి అవస్థని ఇక్కడ రాసలీల అంటారు. ఆ రాసలీలావస్థ ఒక పూర్ణావస్థ.  ఆ పూర్ణావస్థలో కలిగే దివ్యానందమే రాసలీలానుభవం. అందుకు ఈ రాసలీల జరిగినటువంటి రోజు కూడా ఇది.

మహాకార్తికి

మహాకార్తికి అంటే కృత్తిక నక్షత్రముతొ కలసిన కార్తిక పూర్ణమి

అంతేకాదు ఈ రోజు ఏ దేవతను ఆరాధించినా విశేషమే. ఎందుకంటే దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నక్షత్రం కృత్తిక; ఏ దేవతను ఆరాధించాలన్నా "అగ్నిముఖావై దేవాః" అన్నారు గనుక ఈ అగ్ని నక్షత్రమైన కృత్తిక నాడు ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత సంపూర్ణమైన తృప్తిని పొందుతుంది.


అంతేకాదు ఆదివారం సూర్యుని, శివుని; సోమవారం గౌరీదేవిని; మంగళవారం సుబ్రహ్మణ్యుని, గణపతిని; బుద్ధవారం విష్ణువును, గురువారం బ్రహ్మ దేవుని, దక్షిణామూర్తి, హయగ్రీవ వంటి గురుస్వరూపాలను; శుక్ర వారం ఇంద్రుని, ఇంద్రుడు ఆరాధించిన మహాలక్ష్మిని; అలాగే శనివారం శనైశ్చరుని, యముని, రుద్రుని ఆరాధించాలి అని మనకు శాస్త్రములు చెప్తున్నాయి. ఇవి ఏ మాసంలో చేసినా విశేషమే. కానీ అన్ని మాసాలలో ఏడు రోజుల వ్రతం మనం చేయలేం. కానీ కార్తికంలో మాత్రం ఈ వార యజనం చేస్తే సంవత్సరం అంతా వారయజనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అందుకే కార్తికంలో ఏది చేసినా సంవత్సరమంతా ఆ యజ్ఞము చేసిన ఫలితం వస్తుంది.

అందులో ప్రత్యేకించి ఈ పూర్ణిమ నాడు పైన చెప్పిన నియమాలతో పరమేశ్వరుని, విష్ణువుని ఆరాధించాలి. శాస్త్రబద్ధమైన నియమ పాలనతో మహాకార్తికి సాధన చేసి కార్తిక దీప జ్యోతిలో ఆ పరమేశ్వర ప్రకాశాన్ని దర్శించి ధన్యులమౌదాం.

Friday, October 24, 2014

Kartika Puranam in Telugu - Chapter 2 - కార్తీక పురాణము రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము

కార్తీక పురాణము 


రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము

కార్తీక సోమవార వ్రత మహిమ



జనకా!  కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కనుక సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును.

కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పటన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తేసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించును.  శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంట ప్రాప్తియు లభించి గలదు.  దీనికి  ఉదాహరణము కలదు.

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట

పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి ' తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశియుడగు మిత్ర శర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అబ్యాసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్య వాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడను యగుటచే లోకులెల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొను చు౦ డేడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్టురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చు చున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, "చీ పోమ్మనక , విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారి నిష్టురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెను ' కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.

ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ , ఒకనాటి రాత్రి తన భర్త గాఢ  నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయీ ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని,  నానాజాతి పురుషులతో  సంచరించి వర్ణ సంకరు రాలయ్యెను. అంతే గాక పడుచు కన్యలను, భర్తతో కాపురము చేయుచున్న భార్యలను తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భు ధులు  నేర్పి పాడు చేసి, వారి ద్వారా  ధనార్జన కూడ చేయసాగాను.

జనక రాజ! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా!  కర్కశ  వ్రుధాప్య బాధలను అనుభవించి  కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్ర గుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను  చూపించి, భటులారా! ఈమే పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన ఇనుప  స్తా౦భామునకు కట్ట బెట్టుదు' అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦ దులకు గాను-యమభ టులామేను ఎర్రగా కాల్చిన ఇనుప స్తా౦భామునూ కౌగాలిచుకోమని చెప్పిరి. భర్త నూ బండ రాతిలో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారి ణి లుగా చేసినదుకు సలసల కరగిన నూనెలో పదవేసిరి. తల్లితండ్రులకు అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను, పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦బిపాకమును నరకములో వేయగా, అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు,జెర్రులు ఆమెను  కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాలవాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా చాలా కాలము  నరక భాదల ననుభవించి, తిరిగి  కళింగ దేశమున కుక్క జన్మమెత్తినది.  కుక్కను  కర్రతో కొట్టువారు, కొట్టుచు తిట్టువారు, తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి.  కక్క జన్మలో కర్కశ అనేక భాధలను అనుభవించు చున్దెను. కొంత కాలము తర్వాత ఒక కార్తిక మాసములో ఒక సోమ వారము రోజున కుక్కకు పూర్తీ దినమంతయు తిండి దొరక లెదు.   ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమ వార వ్రతమాచరించి ఉపవసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నము తినెను. వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ బలియన్నమగుట చేతను, ఆ రోజు కార్తిక మాస సోమ వారమగుట వలననూ, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుతవల నను, శివ పూజ పవిత్ర స్థానమున  దొరికిన ప్రసాదము తినుట వలనను, ఆ శునకమునకు గత జన్మ జ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆశునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టు కొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులేవారు లేన౦దుకు లోనికే గెను. మరల ' రక్షిపుము రక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు ! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత న కుక్క 'మహానుభావ!  వెనుక జన్మము నందు విప్రకులా౦గానను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్యములో కుష్టు రాలనై తనువు చాలించితిని.  తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవించి ఈజన్మలో కుక్కనైతిని. ఈ రోజు ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా , మీరు చేసిన కార్తిక సోమ వార వ్రత ఫల మొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను'యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాల మహాత్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక మహారాజ! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందుము.


________________

________________
Rose Telugu Movies

http://telugubhaktiblog.blogspot.in/

http://vissafoundation.blogspot.in/2014/10/blog-post_73.html



Thursday, September 25, 2014

Dasara - Durga Vaibhavam - Telugu




దుర్గా వైభవం చాగంటి ప్రవచనం

Chaganti Koteswara Rao - Durga Vaibhavam Pravachanam

భాగం 1
______________

______________

భాగం 2
______________

______________

పార్ట్ 3
______________

______________

Friday, August 29, 2014

Vighneswara Mangala Harati Song - హారతి గైకొనుమా గణనాయక - విఘ్నేశ్వర మంగళ హారతి పాట



విఘ్నేశ్వర మంగళ హారతి పాట 


హారతి గైకొనుమా గణనాయక
మంగళ హారతి గైకొనుమా గణనాయక

అఖువాహనాయ అగ్రపూజ్యాయ
హారతి గైకొనుమా గణనాయక
ఇభావక్త్రాయా ఈశ్వరపుత్రా

హారతి గైకొనుమా గణనాయక
ఉమాసుతా ఊర్జస్వలుడా
హారతి గైకొనుమా గణనాయక
ఏకదంతా ఏకాగ్రచిత్తా
హారతి గైకొనుమా గణనాయక
మంగళ హారతి గైకొనుమా గణనాయక

కళ్యాణగురువా కనకాంబరా
హారతి గైకొనుమా గణనాయక
గజాననా గణనీయా
హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక


హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

Written by Narayana Rao - 9 September 2013



మంగళ మని మంగళ మని పాడరే మన గణ నాథునకు
____________________

____________________
Telugu Bhaktisongs upload

Updated 29 August 2014 - 2014 Vinayaka Chaviti

Thursday, August 28, 2014

Vinayaka - Bhakti Patalu - వినాయక భక్తి పాటలు


వినాయక భక్తి  పాటలు


_____________________

_____________________
Maa Tv Upload
28 August 2014


Ganesh Chaturdhi Songs - 2012 Juke Box - Aditya Music

    Ganesha Telugu Songs - Source: Aditya Music YT video - below
_____________________

_____________________

Friday, August 15, 2014

15 August 2014 - స్వాతంత్య్ర దినోత్సవo - Celebrations - PM's Speech - CM Chandrababu Naidu Speech in Telugu


15 ఆగస్ట్ 2014 స్వాతంత్య్ర దినోత్సవo


మరిచిపోదు మా  తరం
మన చరిత్రలోని అపస్వరం
పరాయి దేశ పాలకులు సాగించిన దుష్కరం
భారతమాత జీవితంలో వొక చేదు అనుభవం

విజయనగర పాలకుల దక్షిణంలో విజయం
శివాజీ నాయకత్వం అనేక కోటల ఆధిపత్యం
సన్యాసుల విప్లవం వందే మాతరం నినాదం
అల్లూరి అమర సమరం ఆంధ్రాలో విప్లవం

ఝాన్సీ రాణి వీరమరణం
వేల సిపాయిల జీవన దానం
స్వరాజ్యం నా జన్మ హక్కని తిలక్   ఇచ్చిన నినాదం
భారత దేశం వదిలి  పొండని గాంధి ఇచ్చిన ఆదేశం

అనేక యోధుల ప్రాణదానం మనకు మరల వచ్చిన స్వాతంత్ర్యం
భారత  మాతకు వైభవాన్ని తిరిగి తేవడం మన కర్తవ్యం
మనమంతా భారత మాత బిడ్డలం భారతీయులం
హిందూస్తాన్ వాసులం హిందువులం

దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయి
గురజాడ మాటలు మరచిపోం
తోటి వానికి గట్టి మేలు  తలపెట్టమని మహనీయులు
చెప్పిన మాట కూడా మర్చిపోం

నా ప్రాణం, నా సౌఖ్యమ్
నా కుటుంభం, మా సంపద
నా దేశం, దేశ సౌభగ్యమ్
విశ్వం కూడా నా దేనని మరచిపోం  మరచిపోం

నారాయణ రావు
15 ఆగష్టు 2014
Source; http://nraopoems.blogspot.in/2014/08/marichipodu-maa-taram.html


____________________

____________________
ABN Telugu upload


About Independence Day - Feature by Andhra Jyoty
____________________

____________________
ABN Telugu upload

ప్రధాని ప్రసంగ విశేషాలు
____________________

ABN Telugu upload

ప్రధాని శుభాకాంక్షలు తెలుగులో చదవండి. అన్ని  భాషలలోను చదివే   సదుపాయం  ఉంది
http://pib.nic.in/newsite/pmmessage.aspx

Thursday, July 10, 2014

India Budget 2014-15 in Telugu


Arun Jaitley's Speech - Uploaded by Mango News
_____________________

_____________________

Tuesday, May 20, 2014

Shatruvu - Telugu Film Songs - Videos



Full Film - Satruvu Video
_________________

_________________


Knol 5081

Narendra Modi - Telugu Biography - 16 May 2014 - నరేంద్ర మోడీ జీవిత చరిత్ర


16 May 2014
లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి-ఎన్‌డిఎ కూటమికి అసాధారణ ఆధిక్యత అందించారు. బిజెపికి ఒంటరిగానే మెజారిటీ సమకూరింది. ఎమర్జెన్సీ అనంతరం పలు పార్టీల కలయికతో ఏర్పడిన జనతా పార్టీని మినహాయిస్తే గతంలో ఎన్నడూ ఒక కాంగ్రెసేతర పార్టీకి సర్వసంపూర్ణమైన ఆధిక్యత కేంద్రంలో లభించలేదు. అసలు 1984 ఎన్నికల తర్వాత ఇంత వరకూ కేంద్రంలో ఒక పార్టీకే ఆధిక్యత సమకూరిన ఉదాహరణ లేదు.
Prajasakti - 16 May 2014

20 May 2014

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని మోడీ వ్యాఖ్యానించారు. దేశంకూడా కన్నతల్లి లాంటిదేనని, ఆ తల్లిపై చూపించాల్సింది కనికరం కాదు సేవ అని మోడీ వ్యాఖ్యానించారు.

http://telugu.webdunia.com/newsworld/news/national/1405/20/1140520039_1.htm



ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న  నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నిక. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన  సమావేశంలో మోడీ పేరును బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదించారు.
http://www.sakshi.com/news/elections-2014/narendra-modi-sworn-in-as-prime-minister-on-26th-132171?pfrom=home-top-story



Sunday, May 18, 2014

Telugu People in President of India Elections


సర్వేపల్లి రాధాకృష్ణన్
కోక సుబ్బా రావు
నీలం సంజీవ రెడ్డి

____________________

____________________

Narendra Modi - Telugu Biography - నరేంద్ర మోడీ జీవిత చరిత్ర


17.5. 2014

నరేంద్ర మోదీ విజయం - ఢిల్లీ పయనం
________________

________________


24.4.2014
వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని  వదోదరలో  ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు (24.4.2014) ఆయన వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు రెండు లక్షలమంది కాషాయదళంతో ప్రదర్శనగా వెళ్ళి మోడీ నామినేషన్ దాఖలు చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవ్య మనవడు జస్టిస్ గిరిధర్ మాలవ్య వారణాసి నుంచి నరేంద్ర మోడీ నామినేషన్‌ని బలపరిచారు.

పవన్ స్పీచ్ ఆన్ నరేంద్ర మోడీ
____________

____________

..........................
‘దేశం సంక్షోభంలో ఉంది. గట్టెక్కాలంటే ప్రతి ఒక్కరూ
కృషి చేయాలి. బిజెపిపై ప్రజా నమ్మకం వమ్ముకానివ్వను శక్తిమేర కృషి చేస్తా. అందుకు మీ ఆశీస్సులు కావాలి’ - నరేంద్ర మోడీ
........................
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13, 2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

ప్రధాన మంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన వెంటనే మోడీ వినమ్రతతో శిరసు వంచి నమస్కరించారు. సీనియర్ నాయకుడు జోషికి పాదాభివందనం చేసి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు మిఠాయి తినిపించారు.


‘దేశంలోని అన్ని రంగాలు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొత్తం దేశమే సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన గుజరాత్ సిఎం నరేంద్ర మోడి పిలుపునిచ్చారు.  ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ నాయకత్వానికి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

____________

____________


 నరేంద్ర మోడీ జీవిత చరిత్ర

నరేంద్ర మోడీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు.

నరేంద్ర మోడీతండ్రి ఒక చిన్న టీ కొట్టు నడిపేవారు. తల్లి చిన్న గానుగ నడిపేది. మోడీ ఆరో ఏటనుండి ఉదయం తండ్రికి సహాయం చేసి పాటాశాలకు వెళ్ళేవాడు.

నరేంద్ర మోడీ ఎనిమిదవ ఏట రాష్ట్రీయ స్వాయంసేవక్ సంఘములో చేరారు. ఉదయం తండ్రికి టీ కొట్టు నడపడంలో సహాయం చేయడం, స్కూలికి వెళ్ళడం సాయంత్రం ఆర్.యస్.యస్ కి వెళ్ళడం మోడీ దినచర్యగా ఉండేది.

18 ఏళ్ల వయసులో మోడీ సంన్యాసం తీసుకుంటాను అని ఇంట్లోనుంచి వెళ్ళిపోయారు. రెండు ఏళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చి అహ్మదాబాదులో ఆయన మామయ్య యొక్క బస్సు స్టాండ్ లోని టీ కొట్టు లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఒక టీబండి ద్వారా  టీ అమ్మడం ప్రారంభించారు.  కొన్ని రోజులు గడిచాక ఆయన   రాష్ట్ర కార్యాలయములో ఒక పనివాడిగా చేరారు. కార్యాలయములో అందరికి ఉదయం టీ, టిఫిన్ తయారు చెయ్యడం తర్వాత కార్యాలయము శుభం చెయ్యడం ఆయన పనిగా ఉండేది.

 1971 లో మోడి  ఆర్.యస్.యస్  శిక్షణ శిబిరానికి నెల రోజులు వెళ్లారు. శిక్షణ తరువాత   ఆయనను ఆర్.యస్.యస్ వాళ్ళు అఖిల భారత విధ్యార్ధి పరిషద్ గుజరాత్ శాఖ వ్యవహారమును చూడమని నియమించారు.

 1974 లో మోడి నవనిర్మాన్ ఆందోళన లో పాల్గొన్నారు.    1975లో కేంద్ర పభుత్వము అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆర్.యస్.యస్  వాళ్ళని జైలుకి పంపించిది. మోడీ పోలీసులకు దొరకకుండా రహస్యంగా పని చేశారు.



Narendra Modi - Detailed Biography in English
http://guide-india.blogspot.com/2013/09/narendra-modi-biography.html


Bibliography

http://www.narendramodi.in/lng/telugu/biography.html

13 September 2013
http://telugu.oneindia.in/news/india/bjp-declares-narendra-modi-as-pm-candidate-122422.html

Saturday, May 10, 2014